Thursday 9 June 2016

(జననీ సేవ ) శిశువులకు వేడి పాలు రైల్వేలో:................

జననీ సేవను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. శిశువులు, బాలింతకలకు జననీ సేవ ఉపయోపడుతుందన్నారు. తొలి దశలో 25 రైల్వే స్టేషన్లలో వేడిపాలు, వేడి నీళ్లతో పాటు శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూ ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని, శతాబ్ది రైళ్ల టికెట్లలో తప్పనిసరి ఆహార నిబంధన సడలింపు చేస్తున్నట్లు తెలిపారు. శిశువుకు పాలు దొరక లేదంటూ ఓ బాలింత తనకు ట్వీట్ చేసిందని గుర్తు చేశారు. శిశువుకు వెంటనే పాలు అందేలా ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది తల్లులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇబ్బందుల దృష్ట్యా అందరికీ ఉపయోగపడేలా జననీ సేవ ప్రారంభించామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment