Saturday 31 October 2015

Elite special forces from around the world

They dig out enemy secrets, perform daring rescue operations and stealth missions, and take on the tasks no one else can do. The brave soldiers of the special operation forces around the world go through rigorous training and spearhead some of the most challenging military operations thrown their way. An integral part of armed forces of any nation, these elite troops are indeed the best of the best.

Salman Khan: I don't think turning 50 is a big deal

Aaahh. Salman Khan lets out a big cry as he takes his seat next to me. He winces as he flexes those bulgy biceps and turns his head from side to side. Hectic promotions are on for his Diwali release, 'Prem Ratan Dhan Payo' (PRDP), but I am told the exhaustion has nothing to do with it; the star has been undergoing intense training for his 2016 film, 'Sultan', in which he plays a wrestler.
I ask if he's ready for the interview and his manager cuts in, "Give him two minutes, please". Salman smiles and quips, "You think I will feel okay in two minutes? Come on, let's do this." Munching on protein cookies and fruits on the side (and repeatedly insisting that I have some of it), he gets talking about movies, controversies, stress and plans for his 50th birthday this December. Excerpts from the interview:
Q. How's your health?
A. Good, but since I am training for 'Sultan', it's getting a bit painful. The prep-up involves a lot of physical exertion, so something or the other keeps hurting everyday. But I am enjoying it all. Don't worry, I won't let my fans down.
Q. You have teamed up with Sooraj Barjatya after a decade and half for 'Prem Ratan Dhan Payo'. What can the audience expect from this collaboration?
A. I value my association with Sooraj; the kind of films we have done has earned us a lot of respect. Yes, we hadn't worked for a long time and now we doing a film, which in my eyes and mind, is better than the three movies we did earlier — 'Maine Pyar Kiya' (1989), 'Hum Aapke Hain Koun...!' (1994) and 'Hum Saath-Saath Hain' (1999). Sooraj's movies are not preachy; there is a nice feeling to them. When you come out of the theatre, you will be glowing because you imbibe all the niceness. It's also one of the biggest budget films that I have done so far.
Q. To what extent are you involved in the marketing process? Why did you choose Diwali for the release?
A. Sooraj wanted a Diwali release. He planned this film three years ago, but then I got busy with other projects.
Q. Did you also take time to agree to do the film?
A. I knew he was writing the script. When he was done with it, we sat down for a narration. There was no way that I could say no to him.
Q. Will you collaborate with him again in the near future?
A. Of course, there will be more collaborations.
Q. You were juggling the shoot of PRDP and your last outing, 'Bajrangi Bhaijaan' earlier this year. Court hearings related to your 2002 hit-and-run case were also going on at the same time. What was your frame of mind? How tough was it concentrate on work?
A. It was very difficult. I had to block everything out and give my 100 per cent to my work. When a fan pays to watch my film, I have to ensure that he/ she enjoys it. I can't do a half-hearted job and say that 'guys, I was going through sh*t'; they won't care. I mean, they do care, but when they go to see a film, they want to enjoy. Concentrating on work when all those things were happening around was really difficult.
Q. What sort of role do you personally prefer playing on screen: family guy 'Prem' or 'Dabangg' style action hero?
A. Depends on the script. Like in 'Bajrangi Bhaijaan', my character could have easily beaten up people and done a lot of stunts, but given the story, he was the one who had to get bashed and bruised to help Munni reach home safely. You have to forget about your image if you want to do an honest job.
Q. The 'Bajrangi Bhaijaan' story turned real with a Pakistani activist helping Indian girl Geeta return home 15 years after she strayed across the border. Do you plan to meet her?
A. I don't think so. I work closely with an NGO which tracks missing children or those in remand homes in India and helps them reunite with their families. We recently sent 30 kids back home. When the first lot was being sent, I went to meet them. So, every time the kids were going home, they expected me to see them off. Besides, two or three of them ran away from home to meet me in Mumbai, so I had to stop going to them. As far as Geeta is concerned, she wanted to meet her biological parents and I am happy at their reunion. The family that she was staying with in Pakistan took great care of her. I hope her real parents take as much care of her. Lot of Indian kids have disappeared and people have exploited them, trafficked them and did what not! Geeta was fortunate to have not gone through any of that.
Q. You will turn 50 on December 27. How do you plan to bring in your big day?
A. I don't think turning 50 is a big deal and so, I have no plans for any celebrations. In fact, we have to work harder for our fans to have a memorable time at the movies. The pain this side is directly proportional to the enjoyment on the other side. And if you endure the pain on the sets, your fans will strive to take their lives a notch higher and be better human beings.

Rumours

#Earlier this month, we witnessed the release of a much talked about film featuring a onetime top model-turned-actress making her comeback in films. Well, while the film all but enticed the audience to flock the theatres, we hear that the lead actress has been left in the lurch when it came to her remuneration. In fact, while the actress' normal fee for a film is close to Rs. 4 crores, she was paid less than half the amount, Rs. 1 cr to be precise and that too as a signing amount, after which, due to lack of funds and the film's underperformance at the box-office, the rest of the dues were withheld.

Due to this, non-payment of dues, we hear that the actress put her foot down stating that she would not promote the film, while her family members, who have a massive fan following on social networking sites backed her decision and refrained from promoting the film on their respective social handles. On the other hand, to soothe matters down, the director of the film as well as its co-producers decided on adding her name as a producer of the film in the last week before it released. 

With this addition as a producing partner, the actress would stand to earn a share of profits from the film's success. However, with the film underperforming at the box office, we wonder what 'profits' exactly she earned! If that wasn't enough, the director of the film further convinced the actress and her family that they could expect more revenue generated once the film is available for DTH, video on demand services and paid previews...

Harbhajan Singh-Geeta Basra tie the knot in Jalandhar

A shimmering embroidered curtain falls on one of the speculated-upon celebrity-romances in recent times.

Cricketer Harbhajan Singh and actress Geeta Basra who were rumoured to be a pair for more than 8 years now, have finally made it official. 

In a ceremony attended by close relatives and friends, the couple exchanged marriage vows through Sikh rituals at a Gurdwara in Jalandhar. The wedding was attended by no member of the film industry.

Says a source from Jalandhar, "Only Sachin Tendulkar and his wife from Harbhajan's side was seen. No one from the entertainment industry attended from Geeta's side." 

A lavish reception was hosted later during the day. 

Geeta and Harbhajan never acknowledged their relationship in public. 

However on July 3 this year, as cricketer Harbhajan Singh turned 35 he went public with his long-standing relationship with his girlfriend actress Geeta Basra in a very unusual way. In Smeep Kang'sSecond Hand Husband where Geeta Basra played one of the leads Harbhajan

Singh made a surprise guest appearance at the end as the man she chooses to marry. Sources close to the couple say this was their way of going public with their relationship. "Bhaji and Geeta have always firmly denied any marriage plans. But the entire cricket fraternity calls Geeta 'Bhabhiji'. We all knew their marriage was definitely happening," says a source.#

Neena Gupta returns with a film on a broken relationship



Between managing her career and home and now putting together all the details of her daughter Masaba's wedding in November, Neena Gupta has her hands full.

"Everything for the wedding has to be planned and executed perfectly. You see, at the end of the day it's just me for Masaba. So I can't afford to slip up. Every detail of the wedding is being meticulously planned," says Neena adding she couldn't have hoped for a better son-in-law. 

"Madhu Mantena is a good man. He is kind to everyone," says the doting mother-in-law, 

Not counting the ridiculous role she recently did in the horror film Alone the very talented but underused Neena Gupta finally returns to the screen as a woman exploring life, marriage and a relationship in debutant director Pushan Kripalani's The Threshold

In its two-character exposition of the domestic dynamics in Neena's return to the big screen the film resembles her hugely successful play Mera Woh Matlab Nahin Tha with Anupam Kher. Neena agrees, "They both explore the man-woman relationship in the post-60 bracket. I am lucky to have got both a play and film where I get to do so much, express so many emotions that women in general empathize with." 

Neena is clean-bowled by the response to the play. "When I agreed to do the play with Anupam Kher I knew I was getting into an interesting territory. But I never knew the response would be so overwhelming. Everywhere in the world women and men are coming up to me to say how much they identify with the play and the interaction between me and Anupam." 

The film The Threshold was a new experience for Neena. "If you look at my career there haven't been too many pivotal roles for me. Here's a film that has just two main characters, a husband and a wife played by Rajit Kapoor and me. Indian cinema hardly has roles of substance to offer to women beyond a certain age. I guess I got lucky." 

What Neena really enjoyed was to be able to improvise on location. "Of course there was a writer (Niharika Negi) with us. But Rajit and I improvised a lot on the dialogues, mining into our own emotional past to make our characters sound real." 

Neena marriage with Vivek Mehra is rocksteady. Neena hopes for nothing more than a peaceful and happy life for herself and her own. "My daughter is happily married to a good man. I'm doing good work on stage and in movies. And I am happy in my marriage. What more could I ask for?"#

SC to examine Muslim Personal Law, may consider banning polygamy

The Supreme Court, which has expressed concerns over Muslim women facing arbitrary divorces, may consider banning polygamy and tripple talaaq system to end the alleged gender bias.
The apex court has asked the Chief Justice of India to constitute an “appropriate bench” to examine the question as to whether Muslim women are facing gender discrimination in cases of divorce or due to other marriages of their husband.
The top court had, in its judgement pronounced on October 16, said that “there was no safeguard of women’s rights against arbitrary divorce and second marriage by her husband during currency of the first marriage, resulting in denial of dignity and security to her”.
The apex court bench of Justice Anil R Dave and Justice Adarsh Kumar Goel had ordered registration of a Public Interest Litigation and for putting it up before the new bench to deal with the issues related to the challenge to the Muslim Women (Protection of Rights on Divorce) Act.
While hearing the matter, the SC referred to a case between Javed vs State of Haryana in 2003, saying that practice of polygamy is injurious to public morals and can be banned just like the practice of sati was banned.
The issue cropped-up during the hearing of a matter related to Hindu Succession (Amendment) Act and the apex court bench noted that “an important issue of gender discrimination which though not directly involved in this appeal, has been raised by some of the counsel for the parties which concerns rights to Muslim women. Discussions on gender discrimination led to this issue also.”
Expressing concern on the issue of “gender discrimination… which concerns the rights of Muslim women”, the apex court said the issue of rights of Muslim women against arbitrary divorce surfaced number of times but was never addressed.
“For this purpose, a PIL be separately registered and put up before the appropriate bench as per orders of the Chief Justice of India,” the bench said.
 muslim-women_1994448i

Friday 30 October 2015

Pak to respond if Saudi sovereignty threatened: Army chief

Pakistan’s army chief General Raheel Sharif said today that any threat to the sovereignty and territorial integrity of Saudi Arabia will evoke a strong response from Islamabad.
He was addressing the concluding ceremony of Pak-Saudi Joint Training Exercise Al-Shibab at the National Counter Terrorism Centre, Pabbi near Jhelum.
Gen Sharif said Pakistan and Saudi Arabia enjoy strong and brotherly relations, which have a long history of deep-rooted cooperation, the Pakistani army said in a statement.
“Any threat to the sovereignty and territorial integrity of Saudi Arabia will evoke a strong response from Pakistan,” he said.
The exercise focused on counter-terrorism training of the special operation forces of Pakistan and the Kingdom of Saudi Arabia which included cordon and search operations, air- dropping and heli-lifting of special forces for operations against terrorist’s activities and their hideouts.
“This exercise signifies the joint effort of our two nations against terrorism and we will defeat this menace in all its forms and manifestation,” he said.
A six-member delegation of the Saudi military, led by General Mufleh Bin Saleem Al-Otaibi, commander special forces of Saudi Arabia, was also present on the occasion.
Separately, Foreign Office spokesman Qazi Khalilullah said Pakistan and Saudi Arabia were brotherly countries and enjoyed friendly and cooperative relations and have close cooperation in many fields including defence and security.
He said the joint exercise started two weeks ago and focused at affording an opportunity to explore new avenues of cooperation to fight terrorism and enhance skills.
The spokesperson said the bilateral cooperation to counter terrorism was vital as Pakistan wa deeply concerned at the increasing threats to regional peace and stability in the Middle East and believed that there was dire need to ensure that the region does not get further destabilised by terrorist groups.raheelsharif

అసెంబ్లీని ముట్టడిస్తాం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో బలవంతంగా భూమిని సేకరిస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ అసైన్డ్ భూములకు లాండ్ పూలింగ్ చట్టం అమలుచేయాలని డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులకు ఎకరాకు 1400 గజాల స్థలాన్ని కేటాయించాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో మరో 300 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీచేస్తే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

Brain stroke పై అవగాహన అవసరం..

దేశంలో పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ జీ రాజశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్‌వంటి కారణాలతో నగరాల్లో ఎక్కువమంది ఈ జబ్బు బారిన పడుతున్నారని అన్నారు. పక్షవాతంపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఎంతో మంది మృత్యువాతపడుతున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ వైద్యులు నిర్వహించిన సర్వేలో ధూమపానం వల్ల 35శాతం మంది (7శాతం మహిళలు), మద్యపానం వల్ల 26 శాతం మంది, హైపర్‌టెన్షన్ వల్ల 26శాతం మంది, మధుమేహం వల్ల 16శాతం, ఊబకాయం వల్ల 16శాతం మంది పక్షవాతం బారినపడుతున్నట్లు వెల్లడైందన్నారు. 

raja


పురుషుల్లో కంటే మహిళల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రుతుస్రావం, గర్భనిరోధక మాత్రలు వాడటం, కుటుంబ ఒత్తిడి, ఉద్యోగాలు చేసే మహిళల్లో పని ఒత్తిడివంటి కారణాల వల్ల హార్మోన్లలో తేడాలు వస్తుంటాయని.. ఫలితంగా వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, సకాలంలో చికిత్స అందిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. 

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మొదటి నాలుగున్నర గంటల్లోపే దవాఖానకు తీసుకువెళితే క్లాట్ బర్‌స్టింగ్ థెరఫీ ద్వారా ప్రాణాపాయం లేకుండా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోకుండా, మాటపడిపోకుండా కాపాడవచ్చని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలావరకు పక్షవాతం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. అందువల్ల పక్షవాతం వ్యాధిపై సరైన అవగాహన పెంపొందించుకుని సరైన జాగ్రత్తలు ఉత్తమమని డాక్టర్ జీ రాజశేఖర్‌రెడ్డి సూచించారు.

సీడ్‌బౌల్‌గా Telangana

telangana రాష్ర్టాన్ని విత్తన ఉత్పత్తి భాండాగారంగా తయారుచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో విత్తనోత్పత్తితో ఉత్పత్తి సంస్థలే లాభపడ్డాయన్నారు. స్వరాష్ట్రంలో రైతులు బాగుపడేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు. వర్షాభావంతో పంటలు ఎండినష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కరువు మండలాలను గుర్తించేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. మూడురోజుల్లో నివేదిక వస్తుందని, వెంటనే కరువు మండలాలను ప్రకటిస్తామన్నారు. గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ రెండేండ్లకు వచ్చేదని, టీఆర్‌ఎస్ హయాంలో అలా జరగనివ్వబోమన్నారు. గొల్ల, కురుమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్‌సీడీసీ కింద జిల్లాకు రూ.50 కోట్లు అందించనుందని తెలిపారు. 

అనాథలు, పేదవారికి రూ.30 వేల తో గొర్రెలు, పెరటి కోళ్లను అందించి ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం దని చెప్పారు. శ్రీనిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.150 కోట్లతో బర్రెలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ తరఫున రూ.5,500 కోట్లు, రోడ్లు భవనాల శాఖ తరఫున రూ.1100 కోట్ల నిధులతో రోడ్డు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. నాణ్యతలో తేడాలు వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. నాణ్యత పాటించకుంటే బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదని, బ్లాక్‌లిస్టులో పెడుతామని హెచ్చరించారు.

అవినీతిపై విచారణ చేపట్టాలి

సింగరేణి పరిధిలోని రామగుండం డివిజన్-3లోని ప్రతిష్ఠాత్మక అడ్రియాల బొగ్గుగనిలో జరిగిన రూ.400 కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని సింగరేణి కార్మిక సంఘం(సికాస) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అడ్రియాల గనిలో 1200 మీటర్ల లోతువరకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులున్నాయని, ఆసియా ఖం డంలోనే అత్యంతలోతైన ఈ గనిలో అధికారుల అవినీతితో పాటు కార్మికులపై పనిభారం పెంచారన్నారు. పనిస్థలాల్లో కార్మికులకు వసతులు కల్పించడం లేదని, అన్నిగనులకు భిన్నంగా ఆడ్రియాలలో పాలన కొనసాగుతున్నదన్నారు. అధికారులు.. కార్మికులగా ఉండాల్సిన సంబంధం, ఈ గనిలో యాజమాన్యం.. కార్మికులుగా మారిందన్నారు. కార్మికులను బానిసలుగా చూడడం సరికాదని, తక్షణమే యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కొలువుతీరనున్న పెంబర్తి కళ!

వరంగల్ జిల్లా జనగామ మండలంలోని పెంబర్తి హస్తకళాకారులు ఓ వీరజవాన్ కాంస్య విగ్రహానికి ప్రా ణం పోశారు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దు జిల్లా జజ్జర్‌లోని పార్లా గ్రామం ఉమ్రావ్‌సింగ్ స్వస్థలం. భారతసైన్యంలో రాయల్ ఆర్టిలెరి నాన్ కమిషనర్ అధికారిగా విధులు నిర్వర్తించిన కెప్టెన్ ఉమ్రావ్‌సింగ్ 1944లో రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. 1962లో చైనాతో యుద్ధంలో ఉమ్రామ్‌సింగ్ వీరత్వాన్ని గుర్తించిన యూకే ప్రభుత్వం 2003లో విక్టోరియా క్రాస్ అవార్డును ప్రదానం చేసింది. విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఉమ్రావ్‌సింగ్ ఒక్కరే. 

అంతటి కీర్తి కలిగిన ఉమ్రావ్‌సింగ్ కాంస్య విగ్రహాన్ని ఆర్మీ అధికారుల కోరిక మేరకు పెంబర్తి హస్తకళాకారులు పదిరోజుల నుంచి శ్రమించి తయారుచేసి శుక్రవారం అందించారు. 210 కిలోల ఇత్తడితో విగ్రహాన్ని తయారుచేశామని, విలువ రూ.మూడు లక్షలు ఉంటుందని హస్తకళాకారులు తెలిపారు. నవంబర్ 1న హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఈ విగ్రహాన్ని ఆర్మీ అధికారులు ఆవిష్కరించనున్నారు. విగ్రహ తయారీలో హస్తకళాకారులు మల్యాల వేణు, శ్రీనివాసా చారి, రాజు, కాళిదాస్, ఆంజనేయులు నర్సింగ్ పాల్గొన్నారు.

పోలీసుల పాత్ర కీలకం

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజాభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకమని జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ అరుణా బహుగణ అన్నారు. ఈ నెల 31న 67వ ఐపీఎస్ పాసింగ్ జౌట్ పరేడ్ జరుగనుందని ఆమె గురువారం పోలీసు అకాడమీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా 67వ బ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఐపీఎస్ అధికారులను ఆమె అభినందించారు. యువత సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలు, విదేశ అవకాశాలను వదులుకుని ప్రజలకు సేవ చేసేందుకు పోలీసు శాఖలో చేరేందుకు ఆసక్తిని చూపడం ఆనందంగా ఉందన్నారు. 

Arunabahuguna


ఈసారి ఐపీఎస్ అధికారుల శిక్షణలో సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు మానవత విలువలపై ఆయా రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులతో అవగాహన తరగతులను నిర్వహించామన్నారు. దీంట్లో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురాంరాజన్, సీసీఎంబీ డైరెక్టర్ లాల్జీసింగ్, సినీ నటుడు నసీరుద్దీన్ షా తదితరులతో ఐపీఎస్‌లకు క్లాసులు చెప్పించామన్నారు. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలు, అంధ కళాశాలలో పరిస్థితులను చూపించామన్నారు. 

అలాగే శ్రమదానం చేయించి వారి బాధ్యతలను పెంచామన్నారు. 67వ బ్యాచ్‌లో మొత్తం 156 మంది శిక్షణ పూర్తి చేసుకొని ప్రజా సేవలో అడగుపెట్టనున్నారని ఆమె తెలిపారు. ఈ బ్యాచ్ నుంచి తెలంగాణకు ముగ్గురు ఐపీఎస్‌లను కేటాయించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన కే అపూర్వరావు తెలంగాణకు ఎంపికయ్యారు. 31న జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని అరుణ తెలిపారు. 

బాలికల విద్య పెరగాలి 
తెలంగాణ నుంచి మొదటి మహిళా ఐపీఎస్‌గా శిక్షణ పొందడం గర్వంగా ఉంది. బాలికలకు ఉన్నత విద్య అం దినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను. అట్టడుగు స్థాయి ప్రజలకు సేవలందించేందుకే ఐపీఎస్‌ను ఎంచుకున్నాను. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన నేను నగరంలోనే విద్యాభ్యాసం పూర్తిచేశాను. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువై మహిళా సాధికరతకు కృషి చేస్తాను. 


చిట్‌ఫండ్ స్కామ్‌ను అరికడతా 
ప్రజలను మభ్య పెట్టి మోసం చేసే సైబర్ క్రైం, చిట్‌ఫండ్ స్కామ్‌లను అరికడతాను. ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసు శాఖ తనకు వారధిగా ఉంటుందని భావించి ఈ వృత్తిలోకి వచ్చాను. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ తనకు బాగానచ్చింది. మా కఠిన శిక్షణ ఉద్యోగ లక్ష్యాలను గుర్తుచేసింది 


ప్రజలకు అందుబాటులో ఉంటా 
వరంగల్ ఎన్‌ఐటీ లో విద్యాభ్యాసం చేసి, తెలంగాణకు ఐపీఎస్ గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. మెకానికల్‌ఇంజినీరింగ్ చేసిన నాకు కార్పొరేట్ ఉద్యోగం మానసిక సంతోషాన్ని ఇవ్వలేదు. దీంతో ప్రజాసేవకు ఆ ఉద్యోగం సరిపోదని భావించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పోలీసు శాఖను ఎంచుకున్నాను.

పెండ్లి.. ఇష్టం లేదన్న వరుడు

మరికొద్ది నిమిషాల్లో పెండ్లి జరుగుతుందనగా.. పెండ్లి ఇష్టం లేదని వరుడు చెప్పడంతో పీటల మీద వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వారాసి గూడలో శుక్రవారం చోటుచేసుకుంది. హయత్‌నగర్‌కు చెందిన సతీష్(27)కు వారాసిగూడకు చెందిన అమ్మాయికి వివా హం కుదిరింది. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు వివాహం జరిపించాలని నిర్ణయించారు. తీరా సమయానికి వరుడు తరఫు వారు రాలేదు. వధువు తరఫు వారు విషయం కనుక్కోగా దూరపు బంధువులు చనిపోయారని చెప్పారు. అనుమానం వచ్చి నిలదీయగా తనకు వివాహం ఇష్టం లేదని వరుడు అసలు విషయాన్ని బయటపెట్టాడని వధువు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దీంతో చిలుకానగర్ పోలీస్‌స్టేషన్‌లో వధువు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

అఖిల్ గిన్నిస్ ప్రసంగం

నలభై ఎనిమిది గంటల నాన్‌స్టాప్ ప్రసంగంతో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా వరంగల్ ఏవీవీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థి గంగాపురం అఖిల్ ప్రసంగం కొనసాగుతూ ఉంది. భారత స్వాతంత్య్ర సమరయోధులు -దేశ భక్తులుఅంశంపై కొనసాగుతున్న ప్రసంగం రెండోరోజు శుక్రవారం అదే ఊపుతో ఉత్సాహభరితంగా సాగింది. పలువురు ప్రముఖులు అఖిల్‌ను అభినందించారు. డాక్టర్లు మాధవరావు, జనార్దన్, ఎస్ వెంకట్రాంరెడ్డి, సుదర్శన్‌రెడ్డి అఖిల్ ఆరోగ్యాన్ని పరీక్షించి అభినందించారు.

ABN రాధాకృష్ణపై కేసు పెట్టండి....

నిరాధార వార్తలు, కథనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరు వు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. శుక్రవారం అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్దన్‌రెడ్డితోపాటు పలువురు అడ్వకేట్లు రాధాకృష్ణపై ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా కొంతం గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సాధించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాధాకృష్ణ అక్కసు పెంచుకున్నాడని ఆరోపించారు. నిరాధార రాతలు రాసి ప్రతిష్ఠకు భంగం కలిగించిన రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుచేసిన వారిలో అడ్వకేట్ జేఏసీ నాయకులు వీ రవికుమార్, తిరుపతివర్మ, సీహెచ్ ఉపేంద్ర, పీ గోవర్దన్‌రెడ్డి ఉన్నారు.

కోర్టు ధిక్కార నోటీసులు కేంద్ర మంత్రి సుజానాచౌదరికి...

మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా చౌదరితోపాటు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మిగతా డైరెక్టర్లు జీ శ్రీనివాసరాజు, హనుమంతరావు, జే రామకృష్ణన్, కే శ్రీనివాసరావు, వీ మాలకొండారెడ్డిలకు సైతం ధిక్కార నోటీసులను జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని న్యాయస్థానం జారీ చేసింది. సుజానా గ్రూప్‌లో సుజానా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న హెస్టియా హోల్డింగ్స్ సంస్థ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ నుంచి సుమారు రూ .100 కోట్లు అప్పుగా తీసుకొంది. అప్పు, ఇతర ఖర్చులతోపాటు రూ.106 కోట్లు చెల్లించాలని లండన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే ఈ బకాయిలను చెల్లించకపోవడంతో బ్యాంక్‌కు గ్యారెంటీ సమర్పించిన సుజానా యూనివర్సల్‌పై బ్యాంక్ అధికారులు హైదరాబాద్‌లో న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై విచారణ సమయంలో సుజానా యూనివర్సల్ సంస్థ ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను వెల్లడించాలని ఈ ఏడాది జూన్ 17వ తేదీన సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిటీ సివిల్ కోర్టు ఆదేశాలపై సుజానా గ్రూప్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే సుజానా గ్రూప్ అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఎంసీబీ బ్యాంక్ అధికారులు తాజాగా హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం సుజానా యూనివర్సల్ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

రాష్ట్ర రాజధాని అభివృద్ధి..

దేశంలో ప్రసిద్ధికెక్కిన నగరాలకు దీటుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అన్నిరకాల వసతులు, సౌకర్యాలున్నాయని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. తాగునీటి పైపులైన్, రోడు అభివృద్ధి పనులకు శుక్రవారం మాదాపూర్‌లో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఐటీ కారిడార్‌లో తాగునీటి సరఫరాకు రూ.25కోట్లతో పైపులైన్, రూ.16కోట్లతో రోడ్లనిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు.
-ఐటీ కారిడార్‌లో పైపులైన్, రోడ్ల పనుల శంకుస్థాపనలో కేటీఆర్
-మరో రెండు సంవత్సరాల్లో20వేల కోట్లతో నగర అభివృద్ధి
-178కోట్లతో దుర్గంచెరువు మీదుగా ైఫ్లెఓవర్

ఈ పనులతో ఐటీ ఉద్యోగులతో పాటు నివాస ప్రాంతాల ప్రజలకు కలిపి సుమారు 30లక్షల జనాభా దాహార్తిని తీరుస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో రానున్న రెండు సంవత్సరాలకాలంలో రూ.20వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. పీవీఎన్‌ఆర్‌లాంటి ైఫ్లెఓవర్ బ్రిడ్జీలు నగరానికి నాలుగు వైపుల ఏర్పాటు చేస్తామన్నారు. రూ.265కోట్ల వ్యయంతో నగరంలో స్కైవే లు, వంతెనలు, పార్కింగ్ తదితర అభివృద్ధి కార్యాక్రమాల ను చేపడుతున్నామన్నారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు రాకపోకలకు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.178కోట్ల వ్యయంతో దుర్గంచెరువు మీదుగా ైప్లెఓవర్ బ్రిడ్జి నిర్మించి జూబ్లీహిల్స్ రోడు నెం-45, 36లకు అనుసంధానం చేస్తామన్నారు.

తాగు నీటికి డోకాలేదు..


హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, మంజీరా, సింగూరు రిజర్వాయర్లు వర్షభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలతో నగరవాసులకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్టు కేటీఆర్ వివరించారు. కృష్ణాజలాలు నవంబర్ 15కి, గోదావరి జలాలు డిసెంబర్ 15కి అందిస్తామన్నారు. కృష్ణా ఫేజ్-3లో జరిగిన అవాంతరాలు తొలగిపోవడంతో పనుల్లో వేగం పెరిగిందన్నారు. కృష్ణా మూడోదశ నీరు ప్రస్తుతం మైలార్‌దేవరపల్లి వరకు వచ్చిందన్నారు. గోదావరి జలాలు ఇప్పటికే సుమారు 150 కి.మీ మేరకు మల్లారం ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు చేరుకున్నాయన్నారు.

ట్రయల్న్ ప్రారంభమైందని మంత్రి స్పష్టంచేశారు. నగరంలో రెండు సంవత్సరాల్లో వేయి కి.మీ వరకు రూ 575 కోట్లతో బీటి రోడ్లు, 400 కి.మీ వరకు వైట్ ట్యాపింగ్ రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాబోయేరోజుల్లో 1800 మెగవాట్ల విద్యుత్తును అదనంగా తీసుకువస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద శేరిలింగంపల్లిని ప్రథమంగా ఎంపిక చేసి ఎల్‌ఈడీ లైట్ల పంపిణీకి కార్యాచరణ చేపట్టనున్నట్టు చెప్పారు.

శేరిలింగంపల్లిని దత్తత తీసుకోవాలని ఉంది....


శేరిలింగంపల్లిని ఐటీ ఉద్యోగులతోపాటు తానుకూడా దత్తత తీసుకోవాలని ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మేల్యేను ఈ ప్రాంతాన్ని దతత్త తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.

కేటీఆర్ కృషి మరవలేనిది.. మంత్రి మహేందర్‌రెడ్డి


రాష్ట్ర రవాణా శాఖమంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాల్లోని 10పాత మున్సిపాలిటీలైన శేరిలింగంపల్లి నుంచి ఎల్బీనగర్, రాజేంద్రనగర్ వరకు గల వివిధప్రాంతాలకు రూ1900కోట్లతో మంచినీటి సౌకర్యం కోసం రెండుమూడు రోజుల్లో జీవోను తీసుకుచ్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలు రంగారెడ్డి జిల్లాను తమ కార్యకలాపాలకు ఎంచుకోవడం జిల్లామంత్రిగా తనకు ఎంతో గర్వకారణమన్నారు.

దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని అగ్రగామిగా తీర్చేందుకు సీఎం నెలనెలా సమావేశాలను నిర్వహించి సమీక్షిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ ఎండీ జనార్దన్‌నెడ్డి, ఐటీశాఖ సెక్రెటరీ జయేష్‌రంజన్, సైబరాబాద్ కమిషనర్ సీవి ఆనంద్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, జలమండలి డైరెక్టర్ జి.రామేశ్వర్‌రావు, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణ, వాల హరీశ్‌రావ్, కోమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
capitals

హైడ్రామా..ప్రేమ పెండ్లి

వర్ధమాన గాయని మధుప్రియ ప్రేమ వివాహం శుక్రవారం హై డ్రామా నడుమ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన బంగి శ్రీకాంత్ హైదరాబాద్‌లోని నల్లకుంట లో ఉద్యోగరీత్యా నివాసముంటున్నాడు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ కుటుంబం చాలాకాలం కిందటే హైదరాబాద్‌లో స్థిరపడింది. చిన్నతనం నుంచే మధుప్రియ గాయనిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నల్లకుంటలోనే నివాసం ఉంటున్న మధుప్రియ ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం 

madhupriya


చదువుతున్నది. ఉద్యోగం చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్ తీసే శ్రీకాంత్‌కు మధుప్రియతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేండ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల కిందటే మధుప్రియకు 18 ఏండ్లు దాటాయి. అప్పటి నుంచి ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. రెండు వైపులా కోరగా, శ్రీకాంత్ తల్లిదండ్రుల నుంచి అంగీకారం వచ్చింది. ఇప్పడే పెండ్లి వద్దంటూ మధుప్రియ తల్లిదండ్రులు నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఇద్దరూ మేజర్లుకావడంతో శుక్రవారం కాగజ్‌నగర్‌లో పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. రెండురోజుల కిందటే మధుప్రియ కాగజ్‌నగర్ చేరుకున్నది. 

శుక్రవారం తెల్లవారుజామున మధుప్రియ తల్లిదండ్రులు నాలుగు వాహనాల్లో వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. శ్రీకాంత్ ఫిర్యాదుతో పోలీసులు బెల్లంపల్లి, కౌటాలలో నాలుగు వాహనాలను అడ్డగించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మధుప్రియను, ఆమె తల్లిదండ్రులను కాగజ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కౌన్సెలింగ్ కొనసాగింది. మంచి ముహూర్తం చూసి వచ్చామని, మార్చి 18న గోదావరిఖనిలో వైభవంగా వివాహం జరిపిస్తామని మధుప్రియకు తల్లిదండ్రులు ఎన్నివిధాలుగా చెప్పినా ఆమె అంగీకరించలేదు. ఏం చేయాలో తోచనిస్థితిలో మధుప్రియ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ముహూర్తం ప్రకారం ఉదయం 11.20 గంటలకు జరగాల్సిన పెండ్లి మధ్యాహ్నం 3.20 గంటలకు జరిగింది.

వేగంగా అనుమతులు.

పరిశ్రమలను ప్రోత్సహించడంలో తెలంగాణ సర్కారు ముందుంటుందని, ఏకగవాక్ష విధానంతో పరిశ్రమల స్థాపనకు వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పే ర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి సమీపంలో నిర్మించిన శ్రీనివాస జిన్నింగ్,ప్రెస్సింగ్ మిల్లును శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా రైతులపై మిల్లర్లు మానవత్వాన్ని ప్రదర్శించాలన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే ఏ వ్యాపారమైనా ముందుకు సాగుతుందని వివరించారు.

eetela


గత ప్రభుత్వాల పాపాల ఫలితంగానే రైతులు దుర్భర జీవితాలను అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేయకపోవడం వల్లే రైతులు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేండ్లలో పూర్తి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు 15 ఏండ్లయినా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులతో కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. గత ముఖ్యమంత్రులు దత్తత పేరుతో పాలమూరును దగాచేశారని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను వెనుకకు నెట్టివేసిన పాపం గత పాలకులదేనని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.

పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, 2018 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో ప్రతీఇంటికి మంచినీరు సరఫరా చేయడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. తర్వాత మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యం తో పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని, మూ డేండ్లలో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు కసిరెడ్డి నారాయణ్‌రెడ్డి, బాలాజీసింగ్ పాల్గొన్నారు.

మేము సైతం.....................

రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్న కంపెనీలు, ఇక్కడి అవకాశాలపై ఆసక్తి కనబరుస్తున్న సంస్థల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. రాష్ట్రంలో చేపట్టే వంతెనలు, టన్నెళ్లు, హుస్సేన్‌సాగర్ సమీపంలో నిర్మించబోయే దేశంలోనే అతి ఎత్తయిన టవర్‌సహా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, నిర్మించేందుకు చైనా దేశ కంపెనీలు సంసిద్ధత వ్యక్తంచేశాయి. మరోవైపు రాష్ట్రంలో తమ కంపెనీని విస్తరిస్తామని ప్రాక్టర్ అండ్ గాంబెల్ ప్రకటించింది. తమ దక్షిణాసియా కార్యకలాపాలను పర్యవేక్షించే ప్లానింగ్ సెంటర్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సీఎం కే చంద్రశేఖర్‌రావుకు తెలియజేసింది. 
-ముందుకు వచ్చిన చైనా కంపెనీలు
-బహుళ అంతస్తుల భవనాలు, వంతెనలు,టన్నెళ్ల నిర్మాణాల్లో పెట్టుబడులు
-హుస్సేన్‌సాగర్ ఒడ్డున అతిపెద్ద టవర్
-85% వ్యయం భరించనున్న బ్యాంక్ ఆఫ్ చైనా
-దక్షిణాసియా ప్లానింగ్ సెంటర్ ఇక్కడే
-సీఎంకు తెలిపిన ప్రాక్టర్ అండ్ గాంబెల్
-ఇప్పటికే ఉన్న కంపెనీల విస్తరణ
-వ్యవసాయం, ఆరోగ్యం, పర్యాటకం
-ఈ మూడు రంగాలపై నెదర్లాండ్స్ ఆసక్తి

వ్యవసాయం, హెల్త్‌కేర్, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై నెదర్లాండ్స్ ప్రతినిధి బృందం ఆసక్తి కనబర్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో చైనా కంపెనీల ప్రతినిధులు, ప్రాక్టర్ అండ్ గాంబెల్ సంస్థ ప్రతినిధులు, నెదర్లాండ్స్ పారిశ్రామికవేత్తలు వేర్వేరుగా కలిశారు. కేసీఆర్ చైనా వెళ్లిన సందర్భంగా, చైనా కంపెనీల ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చలు, పరస్పర అవగాహన ఒప్పందాలు జరుగడం తెలిసిందే.

kcr1


ప్రతిపాదిత ప్రాజెక్టుల స్థలాల పరిశీలన


రాష్ట్రంలో నీటిపారుదలశాఖ చేపట్టే ప్రాజెక్టుల ప్రతిపాదిత స్థలాలను, టన్నెళ్లు తవ్వాల్సిన ప్రాంతాలను చైనా ప్రతినిధిబృందం సందర్శించింది. మూసీనదిపై వంతెన నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని, హుస్సేన్‌సాగర్ ఒడ్డున నిర్మించే అతిపెద్ద టవర్ ప్రతిపాదిత స్థలాన్నికూడా పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించి తాము రూపొందించిన ప్రతిపాదనలను, నమూనాలను సీఎంకు చూపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే టన్నెళ్లను తక్కువ సమయంలో, అత్యంత నాణ్యతతో పూర్తిచేస్తామని చైనా ప్రతినిధులు సీఎంకు తెలిపారు. నగరంలో మూసీపై నిర్మించే బ్రిడ్జిపైనా చర్చలు జరిగాయి.

హుస్సేన్‌సాగర్ ఒడ్డున అతిపెద్ద టవర్


హైదరాబాద్ నగరంలో దుర్గంచెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించేందుకు సీసీసీసీ హైవే కన్సల్టెన్సీ కంపెనీ ముందుకు వచ్చింది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున దేశంలోనే అతిపెద్ద టవర్ నిర్మించేందుకు అయ్యే వ్యయంలో 85% భరించడానికి బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత వ్యక్తంచేసింది. త్వరలోనే మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎంకు తెలిపారు. చైనా బృందంలో బ్యాంక్ ఆఫ్ చైనా ఇండియా హెడ్ చివ్ హెంగ్‌చాంగ్, అంజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ యోగేశ్ వా, ఇండియా హెడ్ మనోజ్ గాంధీ, సీసీసీసీ మేనేజర్ పెంగ్‌యన్‌గాంగ్, బిజినెస్ మేనేజర్ చాంగ్‌చున్‌యుమాన్, బీజింగ్ జిటెక్స్ బిజినెస్ మేనేజర్ వుహావ్, రాడిక్ కన్సల్టెన్సీకి చెందిన జహీర్ అహ్మద్, రాజ్‌కుమార్‌లు ఉన్నారు. 

kcr2


పీఅండ్‌జీ సౌత్ ఏషియా సెంటర్ తెలంగాణలో


తమ సంస్థ సౌత్ ఏషియా ప్లానింగ్ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రాక్టర్ అండ్ గాంబెల్ ఇండియా ఎండీ రిజ్వాని సీఎం కేసీఆర్‌కు చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో రిజ్వానితోపాటు వచ్చిన కంపెనీ ప్రతినిధి బృందం కేసీఆర్‌ను కలిసింది. ప్లానింగ్ సెంటర్, తమ వ్యాపార సంస్థల వివరాలను సీఎంకు రిజ్వాని తెలియజేశారు. ప్లానింగ్ సెంటర్‌ద్వారా దక్షిణాసియాలో కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. మొదట ఈ సెంటర్‌లో 50మంది అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమిస్తామన్నారు. తరువాత ఈ సంఖ్యను 100కు పెంచుతామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలంలోని పెంజర్ల గ్రామంలో 171 ఎకరాల్లో తమ పరిశ్రమ ఉన్నదని, ఇందులో ప్రస్తుతం 786మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని, ఇందులో 80% తెలంగాణ కార్మికులేనని సీఎంకు వివరించారు. 

తమ యూనిట్‌ను విస్తరించాలని నిర్ణయించామని, దీనికి సహకరించాలని సీఎంను కోరారు. విస్తరణవల్ల కార్మికుల సంఖ్య 1200కు పెరుగుతుందన్నారు. తమ సంస్థకు చెందిన కంపెనీలు 80 దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నాయని, వీటికి 150 దేశాల్లో మార్కెట్ ఉందని వివరించారు. పెంజర్లలోని ఉన్న తమ యూనిట్‌లో ఫ్యాబ్రిక్, హోమ్‌కేర్, బ్యూటీ కేర్, ఓరల్ కేర్, బేబీ కేర్, మహిళలు ఉపయోగించే ఉత్పత్తులు తయారవుతాయని తెలిపారు.

సామాజిక బాధ్యత తీసుకుంటాం: రిజ్వాని


రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంతోపాటు సామాజిక బాధ్యతకూడా తీసుకుంటామని రిజ్వాని సీఎంకు తెలిపారు. సామాజిక బాధ్యతకింద ఏం చేయాలని అడిగారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్.. స్థానిక ప్రజలు ఏది కోరితే అది చేయాలని చెప్తూ.. కేజీ టూ పీజీ ఉచిత విద్య కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని రిజ్వానికి సూచించారు. 

సీఎంను కలిసిన నెదర్లాండ్స్ బృందం


రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యపరిరక్షణ, పర్యాటకరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని నెదర్లాండ్స్ రాయబారి అల్ఫోన్సస్ స్టొలింగా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అల్ఫోన్సస్ నేతృత్వంలో నెదర్లాండ్స్‌కు చెందిన సుమారు 15 కంపెనీల ప్రతినిధుల బృందం సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా ఇరువురికి లాభదాయకంగా ఉండే వ్యాపార అవకాశాలపై చర్చించారు. అగ్రికల్చర్, గ్రీన్‌హౌస్ కల్టివేషన్, అగ్రికల్చర్ వర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ తదితర అంశాలు ప్రధానంగా చర్చకువచ్చాయి. తనతోపాటు వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులు సుమారు 20 మందిని ముఖ్యమంత్రికి పేరుపేరున అల్ఫోన్సస్ పరిచయం చేశారు. బృందంలోని ఒక్కొక్కరు ఒక్కోరంగంలో నిష్ణాతులని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశం గురించి స్టొలింగా ముఖ్యమంత్రికి వివరించారు. 

ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఎకనామిక్స్, అగ్రికల్చర్, రీసెర్చ్ తదితర ప్రత్యేక అంశాలపై చర్చించారు. ఫిలిప్స్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి సీఎంతో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు నుంచి వచ్చిన సూచనమేరకు తాము ప్రభుత్వ దవాఖానల్లో హెల్త్‌కేర్ సేవలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ మూడు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎస్ బృందంతో డచ్ బృందం..


అంతకు ముందు బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నెదర్లాండ్స్ బృందం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందంతో సమావేశమైంది. ప్రభుత్వంనుంచి పాల్గొన్న బృందంలో మున్సిపల్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పరిశ్రమలు, వ్యవసాయం, గృహనిర్మాణశాఖల కార్యదర్శులు, మెట్రోరైల్ ఎండీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో టూరిజం, పరిశ్రమలు, మెట్రో తదితర అంశాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, విస్తృతం చేయడానికున్న అవకాశాలపై ఉన్నతాధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. డచ్ కంపెనీల ప్రతినిధులు తమ ప్రత్యేకతలు, సామ ర్థ్యం గురించి ప్రెజెంటేషన్లు ఇచ్చారు. పర్యాటకరంగంలో అడ్వెంచర్, హెరిటేజ్, కేవ్ ఎక్స్‌ప్లొరేషన్ తదితర అంశాలపై రాష్ట్ర టూరి జంశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రెజంటేషన్ ఇచ్చారు. 

పరిశ్రమలకు అవకాశాలు, ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం, పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నాయనేదానిని వివరించారు. మెట్రో రైల్వే వ్యవస్థ.. అందులో ఉన్న అవకాశాలపై మెట్రో ఎండీ వివరంగా తెలిపారు. నెదర్లాండ్స్ బృందంలో హెడ్ ఆఫ్‌ది ఎకనామిక్స్ మైఖెల్ బైర్కెన్స్, సీనియర్ పాలసీ అడ్వైజర్ మాయా ఆచార్య, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కౌన్సెలర్ ఆనంద్ క్రిష్ణన్, నెగ్జస్ నోవస్ ప్రతినిధి రుట్జర్ డి బ్రూయిజ్న్, కాబా ఇన్‌ఫ్రాటెక్ ప్రతినిధి అనురాగ్ చతుర్వేది తదితరులున్నారు.

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: సీఎం


పెట్టుబడులకు, కంపెనీల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వాతావరణం, పరిస్థితులు అన్ని రకాల వ్యాపారాలకు, పెట్టుబడులకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని వివరించారు. మంచి పారిశ్రామిక పాలసీని తీసుకువచ్చామని, మీరు కూడా పెట్టుబడులు పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని రిజ్వానిని సీఎం కేసీఆర్ కోరారు.kcr

చెలరేగిన మావోయిస్టులు

మూడు రాష్ర్టాల్లో మావోయిస్టులు శుక్రవారం రెచ్చిపోయారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒకరిని, మహారాష్ట్ర సరిహద్దులో ఇద్దరిని చంపివేశారు. ఛత్తీస్‌గఢ్‌లో వాహనాలను తగులబెట్టి విధ్వంసం సృష్టించారు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను (ఎస్పీవో) నక్సల్స్ చంపివేశారు. మృతులను బ్రిజ్‌లాల్ తులవి (27) అనిల్ కల్కో(30)గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కేర్‌గత్తా గ్రామానికి చెందిన వీరు ఎస్పీవోలుగా పనిచేస్తున్నట్లు గడ్చిరోలి జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ధనోర తాలుకా సావర్‌గాన్ గ్రామ సమీపం వద్ద గడ్చిరోలి-రాజ్‌నంద్‌గాన్ అంతరాష్ట్ర రహదారిపై కొందరు మావోయిస్టులు పదునైన ఆయుధాలతో వీరిపై దాడిచేసి చంపివేసినట్లు పోలీసులువర్గాలు తెలిపాయి. ఘటన స్థలం వద్ద నక్సల్స్ కరపత్రాలు వేసినట్లు వచ్చిన వార్తలను పోలీసులు తోసిపుచ్చారు.

lprry


మరోఘటనలో రేపంపల్లి అటవీప్రాంతంలో 20కిలోల పేలుడు పదార్థాలు, వైరు బండెల్స్ లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజులుగా అనేక విధ్వంసాలకు పాల్పడుతున్న మావోయిస్టులు శుక్రవారం కూడా బీభత్సం సృష్టించారు. కాంకేర్ జిల్లా అంతాగఢ్ పోలీస్‌స్టేషన్ సమీపంలో చారుగావ్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఐరన్‌వోర్‌పై దాడికి పాల్పడ్డారు. ఇనుప ఖనిజం తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు.. పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా గనిలోకి ప్రవేశించడంతో అక్కడి కార్మికులు భయంతో పరుగులుతీశారు.

buss


మావోయిస్టులు ఆ కంపెనీకి చెందిన 24 ట్రక్కులు, రెండు టిప్పర్లుసహా 28 వాహనాలను తగలపెట్టారు. ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడే మాటువేసిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపినట్లు తెలిసింది. సుమారు రెండుగంటలపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సును దహనం చేశారు. రోడ్డుకు అడ్డంగా కందకాలు తవ్వి చెట్లను రోడ్డుపై పడవేశారు.

ఆదిలాబాద్‌లో గిరిజనుడి హత్య
మంచిర్యాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని కాల్చి చంపారు. మండలంలోని కేరెగూడకు చెందిన కుర్సింగ బల్లార్షాను శుక్రవారం కొందరు మావోయిస్టులు పక్కనే ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లారు. తమ సమాచారం పోలీసులకు ఇస్తున్నాడని, ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో చంపివేసినట్లు వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. శనివారం ఘటన స్థలం నుంచి శవాన్ని తిర్యాణికి తెప్పించుకొని అక్కడి నుంచి బెల్లంపల్లికి తరలించనున్నారు.

ప్రాణాలు వదిలిన ప్రేక్షకుడు

హర్రర్ సినిమా చూడటం అంత తేలికైన పనికాదు.. భయానక సన్నివేశాల్లో ఊపిరి బిగపట్టి చూడాల్సిందే. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేస్తారు. అలాంటి చిత్రాలను చూసి మృత్యువాత పడిన సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. కానీ తాజాగా విడుదలైన హార్రర్ చిత్రం రాజు గారి గది చూస్తూ ఓ ప్రేక్షకుడు చనిపోవడం చర్చనీయాంశమైంది. 

raju


ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదుర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన రామనాథం (55) శుక్రవారం బహదూర్‌పురా క్రాస్‌రోడ్డులోని మెట్రో సినిమా థియేటర్‌లో రాజు గారి గది సినిమాను మార్నింగ్ షో చూడటానికి వచ్చారు. సినిమా చూస్తున్న సందర్భంలో భయానక సన్నివేశాలు వచ్చిన నేపథ్యంలో భీతావాహానికి గురై ప్రాణాలు వదిలారు. సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత థియేటర్ సిబ్బంది రామనాథం శవాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామనాథం శవాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

17వేలమందికి ఉపాధి

రాష్ట్రంలో పెద్ద పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూనే చిన్న, మధ్యతరహా వ్యాపారుల మనుగడ దెబ్బతినకుండా చూస్తామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లాంటి ప్రసిద్ధి చెందిన భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలు నెలకొన్నప్పటికీ చిన్న వ్యాపారులు చితికిపోకుండా ఎలా సమన్వయం చేయాలనే విషయంలో తమ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని స్పష్టం చేశారు. ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. దీనిద్వారా 17వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రస్తుతించారు. రంగారెడ్డి జిల్లా గుండ్ల పోచంపల్లిలో విశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఫ్లిప్‌కార్ట్ ఈ- కామర్స్ సంస్థ అతిపెద్ద ఆటోమేటిక్ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని మంత్రి ఈటల శుక్రవారం ప్రారంభించారు.

eetelarajendr


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముగ్గురు ఐఐటీ విద్యార్థుల ఆలోచనలతో 2007లో పుస్తకాల అమ్మకాలతో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిందని కొనియాడారు. తమ ప్రభుత్వం పరిశ్రమలకు పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నదని ఇక్కడి వాతావరణం పరిశ్రమల ఉత్పత్తులకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఆన్‌లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్‌తో సరుకులను సరఫరా చేస్తుంటే.. చిన్న, మధ్య తరహా వ్యాపారుల మనుగడ సాధ్యమా..? అని విలేకరులు ప్రశ్నించగా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తాము ఈ విషయంపై మాట్లాడామని , సమస్య తీవ్రత తమకు తెలుసునని మంత్రి పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా బడా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రోత్సహించడం ద్వారా పన్నుల రూపంలో ఆదాయంతోపాటు స్థానికంగా ఉపాధి పెరుగుతుందని వివరించారు.

ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలు చిన్న వ్యాపారులను సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని మంత్రి సూచించారు. ఫ్లిప్‌కార్ట్‌లాంటి బడా ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలకు వాణిజ్యపన్నుల్లో ఎలాంటి రాయితీ లేదని మంత్రి స్పష్టం చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద కేంద్రాన్ని గుండ్లపోచంపల్లిలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. కానీ, ఇటువంటి సంస్థల వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉందని అన్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఫ్లిప్‌కార్ట్ ఆంధప్రదేశ్‌లో కూడా తన కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ బిన్నీబన్సాల్ సంస్థ కార్యకలాపాలను, లక్ష్యాలను వివరించారు. అనంతరం ఫ్లిప్‌కార్ట్ ప్రాంగణంలో మంత్రి ఈటల, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీ రామ్మోహన్‌నాయుడు మొక్కలు నాటారు.

ఆలోచనలకు ఆవిష్కరణల రూపం

 మైక్రోసాఫ్ట్, గూగుల్, వాట్సాప్..టెక్నాలజీ ప్రియులకే కాదు సామాన్యుడి జీవితంలోనూ భాగస్వామ్యమై పోయిన అత్యంత పాపులర్ ఆవిష్కరణలు. ప్రపంచం మొత్తం మీద ప్రభావాన్ని చూపిస్తున్న ఈ ఆవిష్కరణలన్నీ ఏదో మారుమూల ప్రాంతంలో అతిచిన్న ఆలోచనలుగానే ప్రారంభమైనవే. ఆయా దేశాల్లో వాతావరణం అనుకూలించి మహా ఆవిష్కరణలుగా మారాయి. ఇలాంటి ఆలోచనలు మన దగ్గరా ఉంటాయి. అయితే అవి రూపుదాల్చే వనరులు, వసతులు లేవు. అలా అంకురించే అనేక ఆలోచనలు మొగ్గలోనే మాయమవకుండా వాటికి సహకరించి, అవి ఆవిష్కరణ రూపం దాల్చి.. మార్కెట్‌లో సత్తా చాటే స్థాయి దాకా చేరవేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ సిద్ధం చేసింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, బెంగళూరులోని స్టార్టప్‌ల కేంద్రాన్ని మించేలా గచ్చిబౌలిలో ఐదు అంతస్తుల్లో టీ హబ్ భవనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి కే తారకరామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏడాదిపాటు శ్రమించి సిద్ధం చేసిన ఈ టీహబ్ నవంబర్ ఐదున ప్రారం భం కానుంది. ఈ నేపథ్యంలో టీ హబ్ విశిష్టతల గురించి మంత్రి కేటీఆర్‌తో నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.....

t-hub


ప్రశ్న: టీహబ్ ఎందుకు?


మంత్రి కేటీఆర్: తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే వారు భారీ సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారికి ఆర్థిక తోడ్పాటు అందించే వారు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడమే టీ-హబ్ ప్రధాన ఉద్దేశం. దీనికి వేదిక టీహబ్ భవనం. హైదరాబాద్ ఐఐఐటీలో 70వేల చదరపు అడుగులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ భవనం నిర్మించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ ఔత్సాహికులు, వారిని పోత్సహించే పారిశ్రామికవేత్తలైన వెంచర్ క్యాపిటలిస్టులు-ఏంజిల్ ఇన్వెస్టర్లను హైదరాబాద్‌కు ఆకర్షించడం ప్రభుత్వ ఉద్దేశం. 

స్టార్టప్‌లకు ఎలాంటి సహకారం అందుతుంది?


విస్త్రృత స్థాయిలో నెట్‌వర్క్‌లను కొనసాగిస్తూ కొత్త ఆవిష్కరణలను తెరమీదకు తేవడం స్టార్టప్‌లకు మేం అందించే ముఖ్య సహకారం. ఈ క్రమంలో స్టార్టప్‌లను, పెట్టుబడిదారులను, రీసెర్చ్ సెంటర్‌లను విస్త్రృతంగా అందుబాటులోకి తేవడం మా ఉద్దేశం. ఈ కేంద్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ), ఐఐఐటీ, నల్సార్‌ల భాగస్వామ్యం ఉంది. బిజినెస్ ప్లాన్ ఎలా రాయాలి? స్టార్టప్‌లను వ్యాపారపరంగా ఏవిధంగా ముందుకుతీసుకువెళ్లాలి? ఈ క్రమంలో పాటించాల్సిన విధివిధానాలేమిటి అనే విషయంలో ఐఎస్‌బీ మెంటార్లు సూచనలిస్తారు. స్టార్టప్‌లు పరిగణనలోకి తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలపై ఐఐఐటీ మెంటార్లు, పేటెంట్లు, ఇంటలెక్చువల్ రైట్స్, లీగల్ అంశాల్లో నల్సార్ నిపుణులు మార్గదర్శనం చేస్తారు. 

ఈ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కల్పించిన సదుపాయాలేంటి?


టీహబ్ విజయవంతమయ్యేందుకు సీఈవో సహా సీఓఓలను నియమించాం. నాస్కాం, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో పాటు దిగ్గజ వ్యాపారవేత్తలతో కూడిన ఒక బోర్డును సిద్ధం చేశాం. ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల మూలనిధి సమకూర్చాం. ఈ నిధిని 100 బిలియన్ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పూర్తి వసతుల కల్పించి నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వనున్నాం. 

సరే.. దీనివల్ల రాష్ర్టానికి కలిగే ప్రయోజనం?


ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఒకరకంగా చూస్తే టీ హబ్ ద్వారా ప్రభుత్వానికి నేరుగా దక్కే ప్రయోజనం లేదుగానీ... ఇప్పటికే ఐటీ రంగంలో పేరెన్నికగన్న హైదరాబాద్ స్టార్టప్‌ల రంగంలోనూ ఐకాన్‌గా మారుతుంది. అది మనకు గర్వకారణం. ఇక ఇక్కడి ఆవిష్కర్తలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. తద్వారా తెలంగాణ బిడ్డలకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి కదా! 

టీ హబ్‌లో స్టార్టప్ భాగస్వామ్యం పంచుకోవాలనుకునేవారు ఎలా సంప్రదించాలి?


టీ హబ్ వెబ్‌సైట్ ఉంది. దాని ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా కార్యాలయానికి నేరుగా వచ్చి ఆసక్తిని తెలియజేయవచ్చు. వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బృందం అర్హులను ఎంపిక చేస్తుంది. అత్యుత్తమ ఆలోచన కలిగి ఉండి, వ్యాపారపరంగా విజయవంతమయ్యే అవకాశం ఉంటే..విద్యార్హతతో సంబంధం లేకుండానే స్టార్టప్‌లకు చోటు కల్పిస్తారు. వారి వారి అవసరాలకు తగినట్లు క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ ఇస్తారు. దీనికి టీ హబ్ నిర్దేశించిన చార్జీలుంటాయి. స్టార్టప్‌లు టీ హబ్‌లో తమ కార్యకలాపాలకు కేటాయించిన సమయం వృథా పోకుండా ఐఎస్‌బీ ద్వారా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అందజేయనున్నాం.

ఏ రంగంలోని స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారు?


హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రంగంలో పేరెన్నికగన్నది. సహజంగానే ఐటీకి చెందిన స్టార్టప్‌లే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. హెల్త్‌కేర్ విభాగంలోని సంస్థలు, వ్యాపారవేత్తలు సైతం వస్తున్నారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు బీవీ మోహన్‌రెడ్డి , సీపీ గుర్ణాని, శశీరెడ్డి, కిట్టూ కొల్లూరి, కీర్తి మెల్కొటే, రాజు రెడ్డి వంటి వారు ఇందులో భాగస్వాములు కానున్నారు. 

ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు?


తెలంగాణలో ఐటీ వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 10 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతుల సామర్థ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐటీ, ఐటీఈఎస్ రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. టీహబ్ రెండో ఫేజ్‌ను రాయదుర్గంలో విస్తరిస్తాం. గేమ్‌సిటీ సమీపంలోని 15 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటవుతుంది. 3లక్షల ఎస్‌ఎఫ్‌టీల్లో ప్రస్తుత భవనానికి నాలుగున్నర రెట్లు ఫేజ్2 ఉంటుంది. 
నవంబర్ 5న ప్రారంభోత్సవం అంటున్నారు. ఆ విశేషాలు..
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్‌టాటాలు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. వీరితోపాటు పారిశ్రామికవేత్తలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు ఇలా చాలామంది వస్తున్నారు.

టీ హబ్‌పై ప్రచారానికి మీ వ్యూహమేమిటి?


హైదరాబాద్‌కు వచ్చిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులందరినీ టీ హబ్ కార్యాలయం సందర్శించాల్సిందిగా కోరుతాం. ఒకసారి వస్తే వారికే ఈ హబ్ విశిష్టత తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి ఇటీవల దీన్ని సందర్శించి అభినందించారు. తమిళనాడు ప్రభుత్వ ముఖ్య 

ktrinterw


కార్యదర్శి కూడా టీ హబ్‌ను మెచ్చుకున్నారు. అడోబ్ సీఈవో శంతను నారాయణ్ టీహబ్‌ను సందర్శించి మైమరచిపోయారు. తాను, మైక్రోసాఫ్ట్ సీఈవో ఉన్న ఫొటోను సెల్ఫీ తీసుకొని సత్య నాదెళ్లకు పంపిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంకోవైపు సిలికాన్ వ్యాలీలోనూ ఫ్రాంచైజీ ఏర్పాటుచేయనున్నాం. సోషల్ మీడియా ఉంది. ప్రచారం కల్పిస్తాం. స్టార్టప్ ఫెస్ట్ నిర్వహించనున్నాం.

వీణావాణీల సొమ్ము స్వాహా!

వీణ-వాణి..! పత్రికల్లో.. టీవీల్లో వారిని చూస్తే గుండె కలుక్కుమంటుంది. ఏ దేవుడి శాపమోగానీ తలలు అతుక్కుని అవిభాజ్య కవలలుగా పుట్టి బతకలేక, విడిపోయే దారిలేక వాళ్లు నరకయాతన పడుతున్నారు. వాళ్లను చూసినవారికి ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. మనసు వికలమవుతుంది. కన్నీళ్లు కార్చకుండా ఉండలేం! అంతటి దయనీయస్థితిలో ఉన్నవారిని అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకోవడం అనేది ఊహించగలమా? అలాంటి పాపిష్టివాళ్లు ఈ భూమ్మీద ఉంటారని కలనైనా అనుకోగలమా? కానీ దురదృష్టం.. జర్నలిజం ముసుగులో ఓ టీవీ చానెల్ యజమాని ఆ కవలల కన్నీళ్లనూ కాసులుగా మార్చుకున్నాడు. వాళ్ల యాతనను రంగుల్లో చూపించి ఆబగా లక్షల రూపాయలు వసూలు చేసుకుని మింగేశాడు. ఇదేం అన్యా యం? అని అడిగిన ఆ పిల్లల తండ్రి మీద బెదిరింపులకు దిగుతున్నాడు. మాట్లాడేందుకు ప్రయత్నించినా కసురుకుంటున్నాడు. ఒక్కపైసా ఇచ్చేది లేదు.. ఏమైనా చేసుకోండంటూ తెగేసి చెప్తున్నాడు. అంత నీచస్థాయికి దిగజారేది ఎవరనేది ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఆయనే వేమూరి రాధాకృష్ణ!!
-ప్రోమోలు, లైవ్‌తో దాతలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గాలం
-విరాళాల్లో పిల్లల కుటుంబానికి ఒక్కపైసా ఇవ్వని కక్కుర్తి రాధాకృష్ణ
-తండ్రి అడిగితే గద్దింపులు, బెదిరింపులు
-కేసు పెట్టి విచారణ జరిపించాలని బాధితుల డిమాండ్
-చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి నీచమైన పనులు

వీణావాణీల అసహాయత మీద పత్రికలు, టీవీల్లో అనేక కథనాలు వచ్చాయి. వారి దైన్యస్థితిని, హాస్పిటల్‌లో వారి పెంపకం తీరును ప్రజలకు వివరించాయి. వారిని విడదీసే మార్గాలమీద, ఇలాంటికేసుల్లో ఇప్పటికి జరిగిన ఆపరేషన్ల మీద ఎప్పటికప్పుడు ఎన్నెన్నో వార్తలు, విశ్లేషణలు! ఏది రాసినా..
ఏది ప్రసారం చేసినా సమాజం వారికి సంఘీభావంగా నిలవాలన్న ఆలోచన తప్ప మరో భావన లేదు. వాళ్లను సురక్షితంగా విడదీస్తే బాగుండునని ప్రజలు కూడా కోరుకున్నారు. మీడియా కానీ.. ప్రజలు కానీ వాళ్లు బాగుండాలని, మామూలు జీవనం గడపాలని ఆకాంక్షించారు తప్ప.. మరో ఆలోచన చేయలేదు. కానీ ఏబీఎన్ చానల్ అధినేతకు మాత్రం ఈ అసహాయతనుంచి డబ్బులు పిండుకునే ఆలోచన వచ్చింది. మా వాళ్లకు ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ ఎక్కువ అని పదేపదే చెప్పుకునే సదరు యజమాని, తమ ఎంటర్‌ప్రైజింగ్ లక్షణాలేమిటో చూపించాడు.

veena1


2012 జనవరిలో ఆ చానెల్ లో వీణావాణీలపై ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. రండి రండి చేయి కలుపుదాం, వీణావాణీలకు అండగా నిలుద్దాం అని పిలుపునిస్తూ ఓ ప్రోమో విపరీతంగా ప్రసారం చేశారు. జనవరి 18న ఎబీఎన్ - ఆంధ్రజ్యోతి గంటా 14 నిమిషాల 31 సెకండ్ల పాటు వీణావాణీల మీద లైవ్ షో నిర్వహించింది. నిస్సహాయస్థితిలో ఉన్న వీరికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే అకౌంట్ నంబర్ 527601010033263లో ఆమోదా పబ్లికేషన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జూబ్లీహిల్స్, హైదరాబాద్ పేరున డిపాజిట్ చేయాలని లైవ్ షోలో పదేపదే విజ్ఞప్తిచేశారు. అకౌంట్ నంబర్‌ను, ఇతర వివరాలను ఆ కార్యక్రమం పొడవునా గ్యాప్ లేకుండా స్క్రోలింగ్‌లలో ఇచ్చారు. వాస్తవానికి ఈ కార్యక్రమం గురించి చెప్పినపుడు వీణావాణీల తండ్రి మురళీగౌడ్ తన ఖాతా నంబరు వేయాలని అడిగాడు. కానీ ఏబీఎన్ తన ఖాతా నంబరు మాత్రమే ప్రసారం చేసింది. 

ప్రసారంలో పిల్లల యాతన చూసి మనసు కరిగి అనేకమంది దాతలు, ముఖ్యంగా ఎన్నారైలు భారీ మొత్తాల్లో విరాళాలు ప్రకటించారు. ప్రత్యక్ష ప్రసారంలో అనేకమంది దాతలు తాము వీణావాణీ కుటుంబానికి సహాయం చేస్తామని ప్రకటించారు. కొందరు ఆపరేషన్ చేయిస్తామన్నారు. కాల్స్‌చేసిన వారు తామే కాకుండా తమకు తెలిసిన వారు, ఫ్రెండ్స్, చుట్టాల దగ్గరకూడా కలెక్ట్‌చేసి తప్పకుండా సహాయం చేయిస్తామని లైవ్ ఫోన్‌ఇన్‌లో భరోసా ఇచ్చారు. సహాయం చేయనున్న మొత్తాలను కూడా అనేకమంది బహిరంగంగా ప్రకటించారు. ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న వీణావాణీల తండ్రి మురళీగౌడ్ చర్చ సందర్భంగా తన ఆర్థిక పరిస్థితిపై, కూతుళ్ల ఆరోగ్యం, భవిష్యత్తుపై బెంగతో భోరున విలపించాడు. 

లైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్న చానల్ ఇన్‌పుట్ హెడ్ కమ్ యాంకర్ మూర్తి ఆపరేషన్ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది.. ఇప్పుడు మురళీగౌడ్‌కు వీణావాణీతోపాటు మరో ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ కుటుంబం పూట గడుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నది. వారికి సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పదేపదే ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మరింత ఎక్కువ సంఖ్యలో కాల్స్ రావడంతోపాటు భారీ మొత్తంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయి. కార్యక్రమం పూర్తయింది. ఎక్కడి వారక్కడకు పోయారు. ఏబీఎన్ ఖాతా నిండింది. కానీ మురళి చేతికి చిల్లిగవ్వ రాలేదు. ఖాతాలో ఎంత జమైందో కూడా ఎవరూ చెప్పలేదు. మురళి ఎవరిని అడిగినా సమాధానం రాలేదు. సహనం నశించి నిలదీస్తే బెదిరింపులు ఎదురయ్యాయి. 

ఇంతవరకు ఒక్క పైసా కూడా ఆ అసహాయులకు అందలేదు. అడిగేవారు లేరు. తర్వాత ఆ కార్యక్రమాన్ని అంతా మరిచిపోయారు. ఈ కార్యక్రమం ఏదో బాగుందనుకున్నట్టుంది. రెండేండ్లకు మళ్లీ నవ్యాంధ్ర రాజధాని పేరిట విరాళాల సేకరణ మొదలైంది. అదీ అయిపోయింది. ఇప్పుడు రైతన్నల పేరిట మళ్లీ దేశం మీద పడ్డాడు. ఎవరెవరో వస్తున్నారు. ఇస్తున్నారు. విరాళాలు కుమ్ముకునేందుకు పత్రిక మొదటి పేజీ అంకితమై పోయింది. అక్కడ ఉరికొయ్యకు రైతు వేలాడుతుంటే ఇక్కడ రాధాకృష్ణ గల్లాపెట్టె గలగలలాడుతున్నది. ఈ సొమ్ములు ఏమవుతాయో తెలియదు. ఎవరికి చేరుతాయో తెలియదు.. అసహాయ కవలల సొమ్ములే మింగేసిన వాడికి రైతులు ఒక లెక్కా? 

మురళి కుటుంబ దైన్యం..


వరంగల్ జిల్లా నర్సింహులుపేట మండలం వీరిశెట్టిపల్లి గ్రామంలో మురళీగౌడ్ కుటుంబం ఉంటున్నది. హాస్పిటల్లో ఉన్న కన్నబిడ్డలను చూసుకోవడానికి నెలకోసారైనా ఇంటిల్లిపాది రావడానికి డబ్బులు సరిపోని దుర్భర దారిద్య్రం. వీణావాణీ పుట్టే సమయానికి మురళికి ఎకరం పొలం ఉండేది. భార్యకు పెద్ద ఆపరేషన్, పిల్లలను దవాఖానలవెంట తిప్పడంలో ఈ ఎకరం హరించుకుపోయింది. అందినకాడికి అప్పులుచేసి పిల్లలను విడదీసేందుకు శక్తిమేర పోరాడాడు. చివరికి అప్పులు మాత్రం మిగిలాయి. వీణవాణీల కంటే ముందు పుట్టిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు అఖిలకు 15 ఏండ్లు. చిన్న కూతురు అంబికకు పదేండ్లు. ఇద్దరూ చదువుకుంటున్నారు. 

పొలం దాటి పోవటంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు మురళి ఒక పాత ఆటో కొనుక్కుని నడుపుకుంటున్నాడు. రోజువారి సంపాదన రూ.150 దాటడం లేదు. నిలోఫర్ హాస్పిటల్‌లో ఉన్న బిడ్డలను చూసిరావాలంటే కనీసం రూ.1000 ఖర్చు అవుతున్నది. కూతుళ్లకు ఏదైనా ఇచ్చిపోకుండా ఉండలేని తల్లిదండ్రుల మనసు! డబ్బులు సరిపోని స్థితిలో వెళ్లలేని నిస్సహాయత! అక్కడ బిడ్డలు ఎదురుచూస్తారనే ఆవేదన! నెలకోసారైనా వెళ్లలేక నాలుగైదు నెలలకోసారి వస్తూ వెళ్తున్నారు.

విచారణతోనే నిజాలు వెల్లడి


పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్లను చూశాం.. శవాలతో వ్యాపారం చేసే వాళ్లను చూశాం.. మాయచేసి కిడ్నీలు కాజేసే దగుల్బాజీలను చూశాం.. కానీ పసిపిల్లల నరకయాతనను రంగుల్లో చూపించి విరాళాలు నొక్కేసే వాళ్లను ఇపుడే చూస్తున్నామని ప్రజలు విమర్శిస్తున్నారు. నాలుగేండ్ల కింద ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వసూలు చేసిన విరాళాలు ఇప్పటి దాకా వీణా-వాణీలకు, వారి కుటుంబానికి అందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 

లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో వేయించుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఒక దైన్యాన్ని చూసి చలించి ఇచ్చిన విరాళాలను కాజేయటం దారుణమని అంటున్నారు. లక్షలు దగ్గర పెట్టుకుని యాజమాన్యం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం ఏ నీతికిందకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న మురళీగౌడ్ కుటుంబానికి కూడా పైసా సాయం చేయకుండా పైగా బెదిరింపులకు దిగడం ఎంత వరకు సమంజసమని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.

ఎవరికి ఫోన్ చేశావ్?.. తెలివుండే మాట్లాడుతున్నావా?


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ కార్యక్రమం నిర్వహించిన తరువాత లక్షల రూపాయలు ఈ బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయి. లైవ్ కార్యక్రమానికి ముందే మురళీగౌడ్ తన బ్యాంక్ అకౌంట్ నంబరు ప్రసారం చేయాలని కోరాడు. కానీ ఏబీఎన్ హెడ్ మీ అకౌంట్ అయితే డబ్బులు సరిగ్గా రావు.. అదే మా అకౌంట్ అయితే నమ్మకంతో ఇస్తారు.. అని చెప్పారు. సరే.. ఎవరి అకౌంట్ అయితే ఏమిటి అనుకున్నాడు మురళి. లైవ్ కార్యక్రమం తరువాత మురళి ఏబీఎన్ ఇన్‌పుట్ హెడ్ కమ్ యాంకర్ మూర్తికి ఫోన్ చేశారు.
-మురళీగౌడ్ : సార్ నేను వీణావాణీ ఫాదర్‌ను. 
-మూర్తి: ఆ.. చెప్పండి.
-మురళీగౌడ్: మొన్న డొనేషన్లు వచ్చినయ్ కద సార్. మాకు సాయం చేస్తరేమోనని ఫోన్ చేసిన.
-మూర్తి: మీకు.. ఇచ్చేదేముంది?
-మురళీగౌడ్: కనీసం రూ.5 వేలు అయినా ఇవ్వండి సార్. చాలా కష్టంగా ఉంది.
-మూర్తి: ఆ విషయం నాకు తెలియదు. నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్ మా బాస్‌ది. ఆయన్నే అడుగు.
-మురళీగౌడ్: సరే సార్. నంబర్ ఇవ్వండి.
-అనంతరం మూర్తి ఇచ్చిన రాధాకృష్ణ నంబర్‌కు ఫోన్ చేశాడు.
-మురళీగౌడ్: సార్ నేను వీణావాణీల తండ్రిని మాట్లాడుతున్నా. 
-బాస్: చెప్పండి.
-మురళీగౌడ్: మా పాపల పేరు మీద డొనేషన్లు వసూలు అయ్యాయి కదా.. కొంత సాయం చేస్తారేమోనని ఫోన్ చేసిన.
-బాస్: ఏయ్.. ఏం మాట్లాడుతున్నవ్! నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? అందులోనుండి మీకు ఏమీ ఇవ్వరు. ఫోన్ పెట్టేయ్!
మురళి ఫోన్ పెట్టేశాడు.. నాటినుండి నేటి వరకు మురళిని ఆ చానల్‌వారు కలవలేదు. ఎంత వసూలైందో కూడా చెప్పలేదు. అసలా డబ్బు ఏం చేస్తారో కూడా ఈయనకు తెలియదు. ఒక్క పైసాకూడా ఈయన చేతికి రాలేదు. నాలుగేండ్లు గడిచాయి. అడిగేవారు లేరు. ఇస్తానన్నవాళ్లూ లేరు. ప్రజలు ఉదారంగా ఇచ్చిన డబ్బులు ఆఖరుకు రాధాకృష్ణ పాలయ్యాయి.

veena2


మందలించినోల్లు లేరు : మురళీగౌడ్


ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో లైవ్ తరువాత మమ్మల్ని మందలించినోల్లు లేరు. మాకెవ్వరూ డబ్బులివ్వలేదు. వీణావాణీలు కాకుండా ఇద్దరు పెండ్లికి ఎదుగుతున్న కూతుళ్లు ఉన్నారు. నాకున్నది డొక్కు ఆటో. నడుపుకుంటే రోజుకు రూ.150 దొరుకుతాయి. రిపేర్ పెడితే కూడబెట్టుకున్న డబ్బులన్నీ పోయినట్టే. కుటుంబం నడుసుడు కష్టంగ ఉంది. బిడ్డలను చూడనీకి పోవాలంటే ఒక్కొక్కరికి రూ.500 అయితయి. భార్యభర్తలం ఇద్దరం పోతే వెయ్యి అయితయి. పోవాలంటే ఇన్ని డబ్బులు ఉంటలేవు. ఎప్పుడో నాలుగైదు నెలలకోసారి పోతున్నాం. బిడ్డలు యాదికస్తె బువ్వ తినబుద్దికాదు. వాళ్లను వదిలేసి మనసు చంపుకుని ఇంటికాడ బతుకుతున్నం

వీణావాణీల గురించి...


పుట్టుకతోనే రెండు తలలు అతుక్కుని వీణ-వాణి జన్మించారు. నాటినుంటి వరకు వీరిద్దరి జీవనం భారంగా సాగుతున్నది. ప్రస్తుతం వీరిని నిలోఫర్ దవాఖానలో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వీరిని వేరుచేసే శస్త్రచికిత్సకోసం ఎందరెందరో డాక్టర్లు వచ్చారు. చూశారు. చర్చించారు. అయితే ఆపరేషన్ విజయవంతం మీద ధీమా ఇవ్వలేని స్థితి ఉంది. ఖర్చుగురించి ఆలోచించవద్దని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లతో పలుమార్లు చర్చించారు. అయినా ఒక అంచనాకు రాలేదు. తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఎయిమ్స్‌కు లేఖ రాశారు. వచ్చి ఒకసారి వీరిని పరిక్షించి వెళ్లాలని కోరారు.veena