Friday 30 October 2015

ప్రాణాలు వదిలిన ప్రేక్షకుడు

హర్రర్ సినిమా చూడటం అంత తేలికైన పనికాదు.. భయానక సన్నివేశాల్లో ఊపిరి బిగపట్టి చూడాల్సిందే. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేస్తారు. అలాంటి చిత్రాలను చూసి మృత్యువాత పడిన సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. కానీ తాజాగా విడుదలైన హార్రర్ చిత్రం రాజు గారి గది చూస్తూ ఓ ప్రేక్షకుడు చనిపోవడం చర్చనీయాంశమైంది. 

raju


ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదుర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన రామనాథం (55) శుక్రవారం బహదూర్‌పురా క్రాస్‌రోడ్డులోని మెట్రో సినిమా థియేటర్‌లో రాజు గారి గది సినిమాను మార్నింగ్ షో చూడటానికి వచ్చారు. సినిమా చూస్తున్న సందర్భంలో భయానక సన్నివేశాలు వచ్చిన నేపథ్యంలో భీతావాహానికి గురై ప్రాణాలు వదిలారు. సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత థియేటర్ సిబ్బంది రామనాథం శవాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామనాథం శవాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

No comments:

Post a Comment