Friday 30 October 2015

ఐటీ కారిడార్‌లో తాగునీటి పైప్‌లైన్‌కు శంకుస్థాపన

ఐటీ కారిడార్‌కు సరిపోయినంత తాగునీటిని సరఫరా చేసేందుకు పునాది రాయి పడింది. రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ కారిడార్ వరకు ఏర్పాటు చేయనున్న కొత్త పైప్‌లైన్‌కు మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పైప్ లైన్ ద్వారా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలీ ప్రాంతానికి సరిపోయినంత మంచినీటిని సరఫరా చేయనున్నారు.

శంకుస్థాపన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు సరిపోయినంత తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ఏ గాంధీ తదితర నేతలు పాల్గొన్నారు.pipe line foundation stone laid for it corridor

No comments:

Post a Comment