ఐటీ కారిడార్కు సరిపోయినంత తాగునీటిని సరఫరా చేసేందుకు పునాది రాయి పడింది. రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ కారిడార్ వరకు ఏర్పాటు చేయనున్న కొత్త పైప్లైన్కు మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మహేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పైప్ లైన్ ద్వారా ఐటీ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలీ ప్రాంతానికి సరిపోయినంత మంచినీటిని సరఫరా చేయనున్నారు.
శంకుస్థాపన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు సరిపోయినంత తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ఏ గాంధీ తదితర నేతలు పాల్గొన్నారు.
శంకుస్థాపన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు సరిపోయినంత తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ఏ గాంధీ తదితర నేతలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment