ఎఫ్టీఐఐ ఛైర్మన్గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు జూన్ 12 నుంచి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమ ఆందోళనను ఉధృతం చేస్తూ నిరవధిక నిరాహార దీక్షను సైతం చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలు రాజకీయ పక్షాల నేతలు మద్దతు ప్రకటించారు. పలు దఫాలుగా విద్యార్థులతో కేంద్రం చర్యలు జరిపినప్పటికీ విద్యార్థుల డిమాండ్లు పరిష్కారం కాలేదు. కాగా తరగతుల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని గడిచిన 139 రోజులుగా కొనసాగిన తమ ఆందోళనను విరమిస్తున్నట్లు విద్యార్థి సంఘ అధికార ప్రతినిధి రంజిత్ నాయర్ తెలిపారు.
అయినప్పటికీ దేశ ప్రముఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ హెడ్గా అనర్హుడైన చౌహాన్ కొనసాగడంపై తమ ఆందోళనలు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత వాతావరణంలో కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఇకపై తమలాగే సమస్యలను ఎదుర్కొంటున్న దేశవ్యాప్త విద్యార్థులను తమ భవిష్యత్ కార్యచరణలో కలుపుకపోనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం దిశగా తమ నిరసనలకు అకడమిక్స్, ఫిల్మ్మేకర్స్ తమతో కలిసి రావాల్సిందిగా ఎఫ్టీఐఐ విద్యార్థులు ఈ సందర్భంగా కోరుతున్నారు.
No comments:
Post a Comment