Friday 30 October 2015

ABN రాధాకృష్ణపై కేసు పెట్టండి....

నిరాధార వార్తలు, కథనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరు వు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. శుక్రవారం అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్దన్‌రెడ్డితోపాటు పలువురు అడ్వకేట్లు రాధాకృష్ణపై ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా కొంతం గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సాధించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాధాకృష్ణ అక్కసు పెంచుకున్నాడని ఆరోపించారు. నిరాధార రాతలు రాసి ప్రతిష్ఠకు భంగం కలిగించిన రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుచేసిన వారిలో అడ్వకేట్ జేఏసీ నాయకులు వీ రవికుమార్, తిరుపతివర్మ, సీహెచ్ ఉపేంద్ర, పీ గోవర్దన్‌రెడ్డి ఉన్నారు.

No comments:

Post a Comment