మరికొద్ది నిమిషాల్లో పెండ్లి జరుగుతుందనగా.. పెండ్లి ఇష్టం లేదని వరుడు చెప్పడంతో పీటల మీద వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్లోని వారాసి గూడలో శుక్రవారం చోటుచేసుకుంది. హయత్నగర్కు చెందిన సతీష్(27)కు వారాసిగూడకు చెందిన అమ్మాయికి వివా హం కుదిరింది. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు వివాహం జరిపించాలని నిర్ణయించారు. తీరా సమయానికి వరుడు తరఫు వారు రాలేదు. వధువు తరఫు వారు విషయం కనుక్కోగా దూరపు బంధువులు చనిపోయారని చెప్పారు. అనుమానం వచ్చి నిలదీయగా తనకు వివాహం ఇష్టం లేదని వరుడు అసలు విషయాన్ని బయటపెట్టాడని వధువు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దీంతో చిలుకానగర్ పోలీస్స్టేషన్లో వధువు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
No comments:
Post a Comment