ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో బలవంతంగా భూమిని సేకరిస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ అసైన్డ్ భూములకు లాండ్ పూలింగ్ చట్టం అమలుచేయాలని డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులకు ఎకరాకు 1400 గజాల స్థలాన్ని కేటాయించాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో మరో 300 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీచేస్తే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
No comments:
Post a Comment